పాకిస్థాన్ రేంజర్లు శుక్రవారం తెల్లవారుఝాము నుంచి మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్లోని నౌషేరా, సుందర్బని, పల్లన్వాలా సెక్టార్లలో విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. గత 12 గంటల్లో ఆరుసార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజా కాల్పుల్లో ఒక బాలికకు గాయాలయ్యాయి.