జియో వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఫర్లను రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ ప్రకటించేశారు. ముంబైలో ముకేష్ అంబానీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జియో ఉచిత సర్వీసులను మార్చి 31వరకు ఉచితంగా అందిస్తామని ప్రకటిస్తూ దీనికి ‘జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్’గా పేరు పెట్టారు. ‘‘కాగిత రహిత సమాజం కోసమే జియో తీసుకొచ్చాం. జియో సిమ్లను హోమ్ డెలివరీ చేస్తున్నాం. సిమ్ తీసుకున్న 5 నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్తో కస్టమర్లకు ఉచిత సేవలు అందిస్తాం. ఈ