దేశాన్ని దోచుకున్న వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం తప్పా? అని ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. నల్లకుబేరులు పేదల జన్ధన్ ఖాతాలను వాడుకుంటున్నారని అన్నారు. తమ జన్ధన్ ఖాతాలో పడ్డ లక్షల డబ్బును, తిరిగి ఇవ్వమని నల్లకుబేరులు అడిగినప్పుడు ఇవ్వమని చెప్పేయండని ఆయన పేదలను ఉద్దేశించి అన్నారు. ఎవరైనా వేధిస్తే 'మోదీకి చెబుతామని చెప్పండి' అని అన్నారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో వారిని ఆధారాలు అడగండి అని వ్యాఖ్యానిం