తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యి కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలం నుంచే తెలంగాణా లో రాజకీయాలకి అతీతంగా ఉండేవారు కెసిఆర్ మీద విమర్శలు మొదలు పెట్టారు. బంగారు తెలంగాణా అంటూ తెలంగాణా మొత్తం తాకట్టు పెట్టడమే కాక అమరావీరులనీ వారి కుటుంబాలనీ పట్టించుకోవడం లేదు అంటూ కెసిఆర్ మీద నిప్పులు చెరుగుతున్న వారు ఎందరో. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ వారి గొంతులు గట్టిగా లేవకపోవడానికి ముఖ్యమైన కారణం వారికి సరైన ప్లాట్ ఫార్మ్ లేకపోవడమే.