కాలం గడుస్తున్నా కొద్దీ కలవకుంట్ల తారక రామారావు లో విపరీత రాజకీయ పోకడలు కనిపిస్తున్నాయి. తెలంగాణా లో కెసిఆర్ వారసత్వ నాయకునిగా ఎదిగే క్రమంలో నాలుకకి పదును పెడుతున్నారు కాని ఉద్యమకాలం లో, ఆ తరవాత ఎన్నికల ముందు తామిచ్చిన వాగ్ధానాలు మననం చేసుకోవలసింది మరచిపోయి, అవి గుర్తుచేసిన వారిని తెలంగాణా ద్రోహులుగా, కాంగ్రెస్ వాదులుగా ముద్రవేస్తున్నారు. అదీ కోదండరాం అంతటి వారిపై కూడా ఏలా పడితే అలా మాట్లాడటం సభ్యత సంస్కారం అనిపించుకోదు.