పెద్ద నోట్లు రద్దై నెల రోజులు గడిచాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.పెద్ద నోట్ల రద్దు సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీ తొలి మీటింగ్ ముంబైలో జరిగింది. పెద్ద నోట్ల రద్దు.. తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కమిటీ తీర్మానించింది. అటు క్యాష్ లెస్ లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పలు రాయితీలు ప్రకటించింది. వారికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించిం