నగదు రహిత లావాదేవీలకు డిస్కౌంట్లు ఇచ్చి మరీ ప్రోత్సాహిస్తున్న వేళ.. కేంద్రం ప్రజల భద్రత దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు జరుగుతున్న ఆన్ లైన్ సేవలకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యొక్క పిన్ నంబర్ లేదా సెక్యూరిటీ పాస్ వర్డ్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. అయితే.. సైబర్ నేరగాళ్లు.. వాటిని సులువుగా పసిగట్టి.. నగదును దొంగిలించేస్తున్నారు. అలాంటి వాటిని పసిగట్టడం సైబర్ పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఒక వేళ నేరానికి పాల్పడ్డ వారిని గుర్తించి పట్టుకున్నా.. వారి వద్ద నుంచి నగదును రికవరీ చేయలేకపోతున్నారు.