ఏపీ సీఎం చంద్రబాబుకు హై కోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు చెప్పింది. ఈకేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఈ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయలేదంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం దర్యాప్తు చేయాలని అధికారులకు ఉత్తర్వులు