తమిళనాడు ప్రజలు ఇప్పుడు మెరీనా బీచ్ ప్రాంతానికి పోటెత్తుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు అక్కడే ఉంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తున్నారు. అయితే జయలలిత సమాధి నుంచి శబ్దాలు వస్తున్నాయంటూ ఓ వార్త వైరల్ కావడంతో..అది ఎలా సాధ్యం అంటూ ఒకింత క్యూరియాసిటీతో మెరీనా బీచ్ కు వస్తున్నారు లక్షలాది మంది జనం. జయలలిత సమాధి నుంచి వస్తున్న శబ్ధాలు వింటూ షాక్ కు గురవుతున్నారు.