పెద్దనోట్ల రద్దు తర్వాత..ప్రజలు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడేలా కేంద్ర పెద్దపీట వేస్తుంది. మరో వైపు పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమౌతుంది. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి అర్జున్ మేగ్వాల్..ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ముద్రించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నోట్ల నాణ్యత మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్లాస్టిక్ నోట్లు ముద్రించాలని నిర్ణయించినట్టు మేగ్వాల్ తెలిపారు.