నవంబర్ 8 తరవాత దేశములో అనేక వివాహ వేడుకలు జరిగాయి. ధనం కోట్లలో ఖర్చు చేశారు. అందరి గురించి ప్రక్కన పెట్టి ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన భారతీయ జనతా పార్టీ మంత్రులు, నాయకులు తమ కూతుళ్ళు, కుమారుల వివాహాలకు కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ నుంచి అందరు ప్రముఖులు విచ్చేసి వధూవరులను దీవించారు.