కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నల్లధనం ప్రవహిస్తోంది. నోటు కోసం సామాన్యుడు ... కష్టాల కడలిని ఈదుతుంటే.. బడాబాబులు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఒక్క నోటు కోసం ప్రజలు రేయింబవళ్లు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తుంటే ... అక్రమార్కులు మాత్రం దొడ్డి దారిన కోట్లాది రూపాయలను ఈజీగా తెచ్చేసుకుంటున్నారు.