ఇంగ్లండ్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. గత మూడు సిరీస్ లలో ఎదురైన పరాభవానికి దెబ్బకి దెబ్బ తీసింది. నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించి మరో టెస్ట్ మిగిలుండగానే.. 3-0తో సిరీస్ ఎగరేసుకుపోయింది కోహ్లి సేన. ముంబై టెస్ట్ చివరి రోజు గంటలోపే ఇంగ్లండ్ చాప చుట్టేసింది. 6 వికెట్లకు 182 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అశ్విన్ మరోసారి ఆరు వికెట్లు తీసుకోవడం విశేషం. టెస్టుల్లో అతను