హైదారాబాద్ను విశ్వనగరంగా చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ సర్కార్... రోజులు గడుస్తున్నా.. కేవలం సమీక్షలతోనే సరిపెడుతోందని అంటున్నాయి విపక్షాలు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు, గ్రేటర్ పాలకమండలి ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతున్నా... ఇప్పటి వరకు చేసిందేమి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై పాలనాపరమైన అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సలహా ఇస్తున్నారు.