తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి చనిపోక ముందు, ఆతర్వాత కూడా అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. జయ మరణం తర్వాత తమిళ తంబిలు ఆమెపై తమకున్న అభిమానాన్ని తమకు తోచిన విధంగా వ్యక్తపరుస్తున్నారు. జయ మృతికి సంతాపంగా వేలాది మంది అభిమానులు తలనీలాలు సమర్పించగా.. మరికొందరు అమ్మ సమాధిని కోవెలగా తలంచి అనునిత్యం పూజలు చేస్తున్నారు. వేలాది మంది వస్తూ పోతుండడంతో మెరినా బీచ్ ప్రాంతం ప్రతిరోజు జనంతో కిక్కిరిసిపోతోంది.