తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను శాసనసభలో ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం.. ప్రజలకు ఏం చేసిందో ఆధారాలతో సహా అసెంబ్లీలో నిలదీసేందుకు వ్యూహ రచన చేశాయి. కాంగ్రేస్, బీజెపి, టీడిపిల ఎదురు దాడులతో శాసనసభ కురుక్షేత్రాన్ని తలపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.