పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ సీనియర్ పార్లమెంటేరియన్ ఎల్కే అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్సభలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. స్పీకర్ను కూడా కలిసి తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయినా సభలో వాయిదాల పర్వం కొనసాగుతుండటంపై అద్వానీ ఆవేదన చెందుతున్నారు. ఇదిలాగే కొనసాగితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎంపీలతో ఆయన అనడం గమనార్హం. సభలో ఎవరు గెలుస