సృష్టిలో జరుగుతున్న కొన్ని అద్భుతాలు అప్పుడప్పుడు మనల్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. వాటిని చూసినప్పుడు అసలు ఇది ఏ విధంగా సాధ్యం అవుతుందో ఎవరికీ అంతు చిక్కదు. అలాంటి సంఘటనలు చాలా అదురుగా జరుగుతూ ఉంటాయి. అంత అరుదైన సంఘటనలో కొన్ని మీడియా దృష్టిని ఆకర్షిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన మీడియా దృష్టికి వచ్చింది. ఈ సృష్టిలో అంతుచిక్కని రహస్యంగా మిగిలిన ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న అనడంలో ఎటువంటి అతిశయోక్తి  లేదు.  



ఇది దాదాపు రెండు శతాబ్దాల నాటి మమ్మీ అని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా... బౌద్ధుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆయన చనిపోలేదనీ.. ధ్యానంలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడం వల్లే అలా ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిని టుక్డమ్ అని పిలుస్తారనీ... ఈ దశ దాటితే ఆయన నిజమైన బుద్దుడిగా మారినట్టేనంటున్నారు. ఇప్పటికీ కూర్చున్ని దేహం కూర్చున్నట్టుగానే ఉండడం నిపుణులైన శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. 200 యేళ్లుగా శరీరంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోనందున దీనిని ఆథ్యాత్మిక మిస్టరీగానే భావించాలనీ... ఈ మిస్టరీని శాస్త్రవేత్తలు పరిష్కరించాలని పరిశీలకులు అంటున్నారు. 



2015 జనవరిలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా మంగోలియా అధికారులు ఈ మమ్మీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి 200 యేళ్ల క్రితం జీవించాడని గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు... ఇప్పటికీ ఆయన దేహంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: