ఓ టీనేజర్‌ తొమ్మిదేళ్ల బాలుడ్ని అత్యంత కిరాతకంగా హతమార్చి, అతడి శరీరాన్ని ఆరు భాగాలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ రక్తం తాగి, మాంసమూ తిన్నాడట. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని డుగ్రీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ లోని డుంగ్రీలో దిలీప్ కుమార్ అనే బాలుడు సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో దిలీప్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



దీప్‌కుమార్‌ అనే బాలుడు సోమవారం కనిపించకుండా పోయాడు. అతడి మృతదేహాన్ని మరుసటి రోజు ఓ ఖాళీ స్థలంలో పోలీసులు గుర్తించారు. పొరుగింటికి చెందిన ఎనిమిదో తరగతి చదివే టీనేజర్‌(16)తో కలిసి దీప్‌కుమార్‌ ఉండటాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే దిలీప్ కుమార్ ను హత్య చేశానని తెలిపాడు.సోమవారం తనకు మాసం తినాలనిపించిందని, తనకు పచ్చి మాంసమంటే చాలా ఇష్టమని చెప్పాడు.



ఆ సమయంలో ఇంటి బయటకు వచ్చి చూడగా దిలీప్ కుమార్ కనిపించాడని, గాలిపటం (పతంగి), దారం (మాంజా) ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లానని, బాత్రూంకి తీసుకెళ్లి, పదునైన ఆయుధంతో దిలీప్ కుమార్ ను హతమార్చానని, అతని శవాన్ని ఆరు భాగాలుగా కోసి రక్తం తాగి, ఆ భాగాలను ఇంటికి దూరంగా పారేశానని, గుండెను మాత్రం స్కూల్ ఆవరణలో పడేశానని చెప్పాడు. ఉపాధ్యాయులంటే తనకు ద్వేషమని, పాఠశాలకు చెడ్డపేరు రావాలనే ఉద్దేశంతో గుండెను అక్కడ పడేశానని చెప్పాడు. పోలీసులు బాలుడి అవయవాలను శవపరీక్షకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: