ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను చూపి రూ. కోటి ఇవ్వాలని ఓ యువతి తన ప్రియుడిని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ (26) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.
ఇతనికి బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఇరువురూ కొంతకాలం ఆనందంగా గడిపారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న నగ్న ఫొటోలను ప్రియుడికి చూపించి, ఇప్పటికే లక్షలు లాగేసింది. ఆ తర్వాత కోటి రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు బయట పెడతానని బెదిరించింది.
అంతటితో ఆగకుండా తనపై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసినట్టు రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు ప్రేమ్ నుంచి రూ. 4 లక్షలను అర్చనకు ఇప్పించారు. దీంతో, ప్రేమ్ కుమార్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు..సమస్యను పరిష్కరించారు.