అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటి నుంచి హిల్లరి, ట్రంప్ ల మద్య ఎలక్షన్ వార్ గట్టిగానే జరిగింది.  చివరి వరకు హిల్లరికి అనుకూలంగా ఉన్న అనూహ్యంగా ట్రంప్ లైన్లోకి వచ్చారు..అధ్యక్షపదవి చేపట్టారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరాడని ఆయన అధ్యక్షులు అయితే తన సొంత పనులకే ఆ పదవిని ఉపయోగించుకుంటారని కొంత మంది వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.  ఇక ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అమెరికా మహిళలతో పాప్‌స్టార్ మడోన్నా కూడా జత కలిశారు. అనుకోని అతిథిలాగా ఉద్యమంలో ప్రత్యక్షమైన ఆమె నల్లటి పిల్లి చెవుల టోపీ, కోటు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Image result for మడోన్నా
వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన భారీ ర్యాలీలో మడోన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్వేత సౌధాన్ని పేల్చేయాలని తాను అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్య‌లు చేసింది.  మహిళలపై తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను ఎదుర్కోవడానికి స్త్రీలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  దీంతో ఒక్క‌సారిగా టీవీ చానెళ్లు వెంటనే ఆ ఆందోళన లైవ్‌ ప్రసారాలను ఆపేశాయి.
Image result for మడోన్నా
అనంత‌రం మడోన్నా వ్యాఖ్యలపై సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర‌ విమర్శలు వచ్చాయి.  సోషల్ మీడియా వేదికగా మడోన్నా వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మడోన్నా తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'నిన్న వాషింగ్టన్‌ ర్యాలీ మంచి అనుభవాన్నే ఇచ్చింది. నేనేదైతే చెప్పాలనుకున్నో.. ర్యాలీలోను అదే చెప్పాను.' అని తెలిపారు 


మరింత సమాచారం తెలుసుకోండి: