వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆఫైర్ బ్రాండ్ ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. చివరకు పోలీసు బాసులనూ వదలిపెట్టడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కు  డీజీపీ సాంబశివరావు బానిసగా పనిచేస్తున్నారని రోజా తీవ్ర విమర్శలు చేసింది. 

roja pc కోసం చిత్ర ఫలితం

రాష్ట్రంలో మహిళలపై తెదేపా నేతలు  దాడులు, అత్యాచారాలు చేస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తింది రోజా. తాను ఆహ్వానం మేరకు మహిళా పార్లమెంటుకు వెళ్తుంటే.. అక్రమంగా అరెస్టు చేయించిన  డీజీపీ మహిళా సమస్యలపై ప్రస్తావించే అవకాశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన రోజా ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలు విలన్ గా భావిస్తారన్నారు.

roja fore on dgp కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు రావణాసుర పాలనపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ న్యాయపోరాటం సాగిస్తామని విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా చెప్పారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సును బాబు మహానాడులా మార్చేశాడని విమర్శించింది రోజా. మహిళా సమస్యలపై మాట్లాడే వారిని ఏ ఒక్కరిని మీటింగ్ కు రానీయలేదన్నారు. 

ap dgp sambasiva rao caste కోసం చిత్ర ఫలితం
తన ప్రభుత్వాన్ని పొగిడి భజన చేసేవారిని ఆహ్వానించి చంద్రబాబు నాయుడు మహిళా సదస్సును నిర్వీర్యం చేశారు.. కేవలం తన కుటుంబసభ్యులకు పరిమితం చేసి కిట్టీ పార్టీలా మార్చేసిందని జాతీయ మీడియా కూడా ఏకిపారేస్తే నిస్సిగ్గుగా మీడియా అమ్ముడుపోయిందని బాబు చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇన్నేళ్లు ఆయనకు భజన కొట్టిన మీడియాను ఎంతకు కొన్నాడో  బాబు చెప్పాలని రోజా మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: