ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలనే టార్గెట్‌ చేసుకుంటూ వెళుతున్న ప్రచారాలు ఏకంగా ప్రాంతాల వారిగా వెళుతోంది. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసే ఉద్దేశంతో అఖిలేశ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులగా మోదీపై విసురుగానే విమర్శలు చేస్తున్న అఖిలేశ్‌ ఈ ప్రకటన ఆధారంగా మరోసారి మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు.


‘గుజరాత్‌ గాడిదలకు ప్రచారం ఆపండి'

ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ బీజేపీ చీఫ్ జితు వాఘని మాట్లాడుతూ, అధికారం కోసం కన్న తండ్రిపై తిరగబడ్డ అఖిలేష్ యాదవ్, గాడిదల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. గాడిదలు అఖిలేశ్‌ యాదవ్‌ మాదిరిగాకాదని, అవి చాలా విశ్వసనీయమైనవని, అలాంటి జంతువుల నుంచి అఖిలేశ్‌ నేర్చుకోవాల్సింది చాలా ఉందని గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ జితు వాఘని అన్నారు.


‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’

‘గుజరాత్ లో గాడిదలకు ప్రచారం ఆపండి..’ అంటూ గుజరాత్ పర్యాటక శాఖకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు అఖిలేష్ సూచిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: