అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. దిక్కుతోచని ఆ బాలిక ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయింది.  అది అటు వెళ్లగానే అదే పట్టాల మధ్యలోనుంచి ఓ మహిళ పైకి లేచింది. నడుచుకుంటూ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లిపోయింది. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారు ఒక్క క్షణం తమ కళ్లను తాము నమ్మలేకపోయారు.


అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!

ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. మన దేశంలోనే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీడియో మొదట్లో రైలు వెళ్తున్న దృశ్యం మాత్రమే కనబడుతుంది. రైలు పూర్తిగా ప్లాట్‌ఫాం మీద నుంచి వెళ్లిపోయిన తర్వాత పట్టాలపైనుంచి మహిళలేచి రావడం కన్పిస్తుంది.



ఈ ప్రమాదంలో ఆ అమ్మాయికి ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్‌ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: