'టాలీవుడ్ లో మరో నిర్మాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజలను ఇబ్బంది పెట్టిన ఓ నిర్మాతను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన 
తండ్రి ఓ ప్రముఖ నిర్మాత కూడా. ఆయనే పరుచూరి ప్రసాద్. ఆయన కుమారుడు పరుచూరి కిరిటీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత చిత్రం

పరుచూరి కిరీటి బీటెక్ చదువుకున్నాడు. గతంలో ఓ బాలకృష్ణ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు. ఈయన ఇటీవల ఫార్చ్యూనర్ కారుపై వేగంగా డ్రైవ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఈమేరకు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇలా గత నాలుగు రోజులుగా ఆ రోడ్డులో ఒకే సమయంలో కారు అతి వేగంగా వెళ్తుండడంతో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 45లో ఉన్న ఓ హోం గార్డు గమనించి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

rash driving కోసం చిత్ర ఫలితం

దాంతో ఆయన రాకపోకలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. సీసీ కెమేరా ఫుటేజ్ కూడా పరిశీలించారు. వాటిలో ఆయన కారు నెంబర్ గుర్తించి.. ఆయన ర్యాష్ డ్రైవింగ్ ను నిర్దారించుకున్నారు. ఈ శుక్రవారం తెల్లవారుజామున కూడా అదే తరహాలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు నేరుగా అతన్ని పట్టుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: