తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసులు అంటూ పదే పదే విమర్శించడంతో కాంగ్రెస్ నేతల ఇగో హర్టవుతోంది. తెలంగాణ ప్రభుత్వంపైనా.. కేసీఆర్ పైనా.. టీఆర్ ఎస్ పై వారు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

karne prabhakar కోసం చిత్ర ఫలితం
కేసీఆర్ జనం సొమ్ముతో సొంత మొక్కులు తీర్చుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్  కాంగ్రెస్ నాయకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమతి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. 

telangana congress leaders కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్‌లో ప్రస్తుతం జబర్దస్త్‌ 2 షో నడుస్తోందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న కామెంట్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కర్నె విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం అబద్దాల సామ్రాట్‌గా కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. డీకే అరుణ మహిళా అనే మాట కూడా మర్చిపోయి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. 
jagadish-reddy-pc

సీఎం కేసీఆర్‌నుద్దేశించి అరుణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చప్రాసి పని చేసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల టీఆర్ ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ నేతలను తిట్టడంలో కేసీఆర్ తో పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు సన్నాసి స్థాయి నుంచి బిచ్చగాళ్ల స్థాయికి దిగజారుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కూడా కామెంట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: