స్టార్ మా ఛానెల్లో చిరంజీవి నిర్వహిస్తున్న షో మీలో ఎవరు కోటీశ్వరుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షో నాగార్జున నిర్వహించినప్పుడు బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది. మొదట్లో ఈ షో హిందీలో అమితాబ్ బచ్చన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ హీరో చేసిన షోను ఇంకొకరు చేస్తే ఆటోమేటిగ్గా పోలిక వస్తుంది. ఒకరి ప్రభావం మరొకరిపై పడుతుంది. 

Image result for chiru meelo evaru koteeswarudu

నాగార్జున మాత్రం అలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తనకంటూ ఓ స్టైల్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా షోలో పాల్గొన్నవారితో ఆప్యాయంగా మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ ను మరిపించారు. నాగార్జునకు ఈ షో చాలా మంచి పేరు తెచ్చింది. కానీ నాగార్జున చేసిన పాత్రలో ఇప్పుడు చిరంజీవి అంతగా మెప్పించలేకపోతున్నారన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. 

Image result for chiru meelo evaru koteeswarudu

ఈ విషయం రేటింగుల్లోనూ తేలిపోతోంది. ఈ విమర్శల నేపథ్యంలో ఈ షోపై ఇంగ్లీష్ పత్రిక దక్కన్ క్రానికల్ ఓ సంచలన వ్యాసం రాసింది. ఈ  ప్రొగ్రాంకు ఆశించిన స్పందన రావడం లేదని.. ఈ షోలో చిరంజీవి ప్లాప్ అయ్యారని కుండబద్దలు కొట్టేసింది. చిరంజీవి తన సొంత స్టైల్ చూపించకుండా నాగార్జునను అనుకరించడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.  

Image result for chiru meelo evaru koteeswarudu
ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఈ షో ప్లాప్ అయ్యిందని దక్కన్ క్రానికల్ రాసుకొచ్చింది. ఈ షో ఒక్కో ఎపిసోడ్ కు ముప్పై లక్షల రూపాయల వ్యయం అవుతుందట. అందులో పదిహేను లక్షల రూపాయలు మెగాస్టార్ కు ఇస్తారట. మొత్తం అరవై ఎపిసోడ్ లు ఉండే ఈ సీరిస్ ఫ్లాప్ కావడానికి టైమింగ్ కూడా ఓ కారణమంటోంది దక్కన్ క్రానికల్. 



మరింత సమాచారం తెలుసుకోండి: