జగన్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి.. ఆయనకు రాజయోగం ఉంది. ఇదీ స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే విషయం. ఆయన అభిమానులు కూడా అదే నమ్ముతారు. కాకపోతే 2014లోనూ వారు ఇదే నమ్మకం పెట్టుకున్నారు. కానీ 2 శాతం ఓట్ల తేడాతో వారి నమ్మకాన్ని జనం వమ్ము చేశారు. అప్పటి నుంచి జగన్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. 


తాజాగా వైఎస్ సొంత గడ్డ కడపలోనూ ఓడిపోవడం ఆయన్నూ, ఆయన అభిమానులనూ తీవ్రంగా కలవరపెడుతోంది. సొంత జిల్లాలో, సొంత బాబాయిని గెలిపించుకోలేని వాడు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఎలా విజయాలవైపు నడిపిస్తాడు అనే లాజిక్ జనంలో పెరుగుతుందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. అయితే జగన్ జాతకానికి చెందిన విశేషాలు కూడా ఈ ఎన్నికల ఓటమిని చెప్పకనే చెబుతున్నాయట. 


జగన్ కు ఈ 2018 వరకూ గడ్డు రోజులు ఉన్నాయని జగన్ జాతకాన్ని విశ్లేషించిన ఓ జ్యోతిష్యుడు చెబుతున్నాడు. ప్రముఖుల జాతకాలని విశ్లేషించే ఆస్ట్రోగురు వేణు తాజాగా జగన్ జాతకాన్ని విశ్లేషించారు. ఆయనకు 2018లో మరిన్ని కష్టాలు ఉంటాయట. అంటే బహుశా అవినీతి కేసుల విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో..



కానీ 2019 నుంచి మాత్రం జగన్ కు రాజయోగం ఉంటుందట. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీయే విజయం సాధిస్తుందా.. జగన్ ఫ్యాన్స్ మాత్రం ఈ జాతకం చూసి మురిసిపోతున్నారట. తాత్కాలికంగా ఇబ్బందులున్నా వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: