విదేశాల నుంచి సోనియా రాక..
అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం భారత్కు తిరిగి వచ్చారు. ఈ నెల మొదట్లో మెరుగైన చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోనియా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ఆమె భారత్కు తిరుగొచ్చెసరికి రాజకీయంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్లో బీజేపీ ప్రభంజన విజయం సాధించింది. మణిపూర్, గోవాలో ఆధిక్యం సంపాందించిన కాంగ్రెస్ ప్రభుత్వాలను మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.
జయలలిత మేనకోడలు ఆస్తులివే
ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన జయలలిత మేనకోడలు దీప ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. మొత్తం ఆస్తులు రూ.3.05కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. ఇందులో రూ.2కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.1.05కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. 2016-17 వార్షిక సంవత్సరానికి 5.37లక్షల ఆదాయం వచ్చినట్లు అఫిడవిట్ లో తెలిపారు. అలాగే గతేడాది రూ.17.50లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ రూ.2కోట్ల వరకు ఉండవచ్చునని పేర్కొన్నారు.
రూటు మార్చిన దీదీ: బీజేపీకి మద్దతు
పెద్దనోట్ల రద్ద సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని, బీజేపీ తూర్పారబట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీ మెత్తబడ్డారు. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తామని ఆమె స్థానిక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎల్.కె.అద్వానీ, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లలో ఎవరినీ నిలబెట్టినా తమకు అభ్యంతరం లేదని ఆమె చెప్పారు.
ఎంపి రవీంద్ర పై బ్యాన్
అమెరికాలోనే కాదు ఇండియాలో కూడ ట్రావెల్ బ్యాన్ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ తమ విమానాల్లో ప్రయాణించకుండా బ్యాన్ ను విధించాయి. ఎయిరిండియా సిబ్బందిపై దాడిచేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ కు చేదు అనుభవం ఎదురౌతోంది.ఎయిరిండియా సిబ్బందిపై ఎంపి దాడి చేసిన ఘటనతో ఇతర విమానయాన సంస్థలన్నీ ఆయనను తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించడం లేదు.
అమెరికాలో మహిళా టెక్కీ, కొడుకు హత్య
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంత రావు భార్య శశికళ, తనయుడు హనీష్ సాయి మృతి అంశాన్ని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. శశికళ, హనీష్ మృతిలపై ఆయన స్పందిస్తూ.. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అన్నారు. ప్రమాదకరం అన్నారు. రెండు వారాల క్రితమే ఇద్దరు ఇండియన్స్ హత్య గావించబడ్డారని, ఇప్పుడు మరో ఇద్దరు చనిపోయారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాతో మాట్లాడాలని టి సుబ్బి రామిరెడ్డి సూచించారు.