తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు శివాజీ రాజ.  ప్రస్తుతం మా మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివాజీ రాజా ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు.   గతంలో కమెడియన్స్ చాలా మంది కలిసి  బ్రహ్మానందం పేరు వెల్ఫేర్ అసోసియేషన్ నెలకొల్పారు.  దీంతో పేదలకు, కష్టాల్లో ఉన్న మూవీ ఆర్టిస్టులకు ప్రయోజనం కలిగేలా చేయడమే దాని లక్ష్యం అయితే నిధుల ఖర్చు విషయంలో కొంచెం తేడా రావడంతో, అది పెద్ద గొడవకు దారి తీసింది.

ఈ విషయంలో బ్రహ్మానందాన్ని కమెడియన్ శివాజీ రాజా నిలదీశాడట. దీంతో ఇద్దరి మద్య వాగ్యూద్దం జరగడం ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో పరిటాల రవి, మోహన్ బాబుల వరకు కూడా వెళ్లింది. ఈ విషయాన్ని శివాజీ రాజానే స్వయంగా వెల్లడించాడు. అయితే ఒకరోజు మోహన్ బాబు ఫోన్ చేసి తాను షూటింగ్ లో ఉన్నానని ఆ స్పాట్ కి శివాజీ రాజాను రమ్మని పిలిచాడట.  అయితే అప్పటికే అక్కడ పరిటాల రవి కూడా ఉన్నాడట.  ఇంతలోనే షూటింగ్ స్పాట్ నుంచి శ్రీహరి ఫోన్ చేసి ‘ఇక్కడకు రావొద్దు..పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని ’ హెచ్చరించడాట.

కానీ మోహన్ బాబు కి తాను ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ స్పాట్ కి వచ్చాడట.  ఆ సమయంలో మోహన్ బాబు షూటింగ్ బిజీలో ఉండగా చైర్ లో పరిటాల రవి కూర్చొని ఉన్నారట.  ఆయన శివాజీరాజాతో మాట్లాడుతూ..'ఎందుకమ్మా గొడవలు... కామ్ గా ఉండండి' అని చెప్పారట. ఆ తర్వాత వచ్చిన మోహన్ బాబు... 'తమ్ముడూ టీ తాగు' అంటూ టీ ఇచ్చి... 'ఏమిటి ఈ గొడవలు?' అని ప్రశ్నించారట. దీంతో, 'ఏం లేదన్నయ్యా, ఇప్పుడు అంతా సెట్ అయింది' అని శివాజీ చెప్పాడట. దీంతో, 'వెరీ గుడ్, వెళ్లు' అని మోహన్ బాబు అన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: