భారత దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా..కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  తాజాగా మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలోలో ఘోర ప్రమాదం జరిగింది.

పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సేనాపతి జిల్లాలోని ఇంఫాల్‌-దిమాపూర్‌ మార్గంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఇంపాల్ నుంచి బయలుదేరిన బస్సు 65 కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదానికి గురైంది. 25 మంది ప్రయాణికులు గాయపడ్డారని వారిని స్థానిక మరమ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: