వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాని అధ్యక్షుడు జగన్ తర్వాత అంతగా పాపులారిటీ ఉన్న నాయకురాలు ఆర్కే రోజా అని చాలామంది అంటుంటారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నాయకులు ఉన్నా.. రోజా తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. వైసీపీ వాదనను బలంగా మీడియాలో వినిపిస్తున్నారు. 



ప్రత్యేకించి చంద్రబాబుపై రోజా ఒంటికాలిపై లేస్తారు. జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటున్న మహత్యమో ఏమో కానీ చంద్రబాబుపై పంచ్ డైలాగులు కూడా బాగానే వేస్తున్నారు. తాజాగా ఆమె టీవీ 9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ హాట్ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సారీ చెప్పే ప్రసక్తే లేదంటూ ఆమె ఈ ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారు. 



దాంతో పాటు పలు అంశాలపై ముచ్చటించిన రోజా.. పనిలోపనిగా బాలకృష్ణపైనా సెటైర్లు వేయడం విశేషం.. తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదించే క్రమంలో ఆమె బాలయ్యపై, చంద్రబాబుపై జాయింటుగా సెటైర్లు వేశారు. నాయింట్లో కాల్పులు జరగలేదు.. నేనెవరినీ వెన్నుపోటు పొడవలేదు.. నేనెవరిపైనా దాడి చేయలేదు... నాపై అనవరసర వివాదాలు రేపుతున్నారు అన్నారు రోజా. 



నా ఇంట్లో కాల్పులు జరగలేదు.. ఈ డైలాగులు బాలకృష్ణను ఉద్దేశించి చేసినవే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలయ్య ఇంట్లో గతంలో ఒకసారి కాల్పులు జరగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ నిర్మాత గాయపడ్డారు కూడా. అలాగే వెన్నుపోటు ఆరోపణలు చేసింది చంద్రబాబుపై అని వేరే చెప్పనక్కర్లేదు. వెన్నుపోటు అనే పదం గుర్తురాగానే చంద్రబాబే గుర్తొస్తారని చాలా మంది నాయకులు కామెంట్లు చేస్తుంటారు కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: