ఏపీలో ఆ మద్య ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్లు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ స్మగ్లర్లకు సినీ ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కొందరు మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఈ మద్య బయట పడింది. ఇక ఎర్ర చందనం స్మగ్లర్, మాయలేడి సంగీత ఛటర్జీ ఎట్టకేలకు దొరికిపోయింది. ఎయిర్ హెస్టెస్ గా ఉండే సంగీత వయసు కేవలం ఇరవైఆరేళ్లే. కాని ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ సంబంధం ఏర్పరుచుకున్న తర్వాత ఆమె వ్యాపకం మొత్తం మారిపోయింది.
డబ్బుపై వ్యామోహంతో స్మగ్లర్లతో చేయి కలిపింది. లక్ష్మణ్ అరెస్టు తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు హవాలా ద్వారా ఆమె భారీగా నగదు మార్చినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆరోగ్యం బాలేదన్న సాకుతో తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని.. ఆరునెలల పాటు అజ్ఞాతంలో వుండిపోయింది.రెండుసార్లు అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఏపీ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిందామె.
అయితే సంగీత బ్యాంక్ ఖాతాల నుంచి సుమారు 25 కోట్ల మేర సొమ్ము స్మగ్లర్లకు బదిలీ అయినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం సంగీత భర్త లక్ష్మణన్ ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి ఆమె కదలికలను బాగా గమనించి పోలీసులు కల్ కతాలో అరెస్టు చేశారు. ఆమెను అర్దరాత్రి చిత్తూరు కు తీసుకు వచ్చారు.