ఏ పొలిటికల్ నాయకుడికి లేని జాతకాల పిచ్చి జగన్ కు బాగా పట్టినట్టు ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ జతాకాలపై తెగ నమ్మకం పెట్టుకున్నాడు.. జగన్ రాజకీయ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకమే అన్నవార్తలు వెలువడుతున్న తరుణంలో జగన్ జాతకాలను నమ్ముకోక తప్పడం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇటీవల వైసీపీ కి కంచు కోటగా భావించిన కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఆనం వివేకానంద రెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి జగన్ కి రాజకీయ భవిష్యత్తు పై భయం పట్టుకుందట. అందుకే జహాన్ కొత్త ఏడాది తన జాతకం ఎలా ఉందని పంచాగ కర్తలని అడిగి తెలుసుకున్నాడట.


Image result for jagan

వైసీపీ అధినేత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. అయితే జగన్ జాతకం మాములుగా లదని అత్యద్భుతంగా ఉందని, జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాడమే కాక, జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహిస్తారని ఆయన వెల్లడించడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ వెల్లడించారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పుకొచ్చారు. 


Image result for jagan

కాగా ఉగాది సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. పంచాంగ శ్రవణాన్ని జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలకించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జగన్ వస్తావ పరిస్థితులకు పంచాగ కర్త చెబుతున్న మాటలకు మాత్రం అస్సలు పోలిక లేదని, జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం, ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఎంత మాత్రం లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: