ముందు శ్రీమతి భువనేశ్వరి చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ఆ ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గాదేవిని ఆంధ్రా వాసు లంతా వేడుకోండి. ఆమే బాబుగారిని ఆరోగ్య విషయాల్లో (మరి ఇతర విషయాల్లో కూడా శాసిస్తున్నట్లు బాబుగారు చెప్పలేదు) శాసించే రిమోట్ అట.
తాను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తాను అనారోగ్యం పాలైతే రాష్ట్రానికి సుస్తీ వస్తుందని (జబ్బు చేస్తుందని) ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న ఆయన ప్రసంగించారు.
ఈ సంధర్భంగా "నేను ఆహార నియమాలను చాలా బాగా పాటిస్తాను. నా భార్య చేతిలో ఉండే రిమోట్ నన్ను కంట్రోల్ చేస్తుంది. నేను బతకడానికి తింటా కానీ! తింటానికి బతకను.." అని చెప్పారు.
ఆహార నియమాలు పాటిస్తానని చెప్పడం వరకు మంచిదే. ఆని తనకు అనారోగ్యం వస్తే రాష్ట్రం అనారోగ్యం పాలు అవుతుందని అనడం అంత బాగున్నట్లు లేదు. మరి ఇప్పుడు అనేక జబ్బులతో ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు బాబు దేహములో కొంత భాగమా? అయితే కొంత భాగం బాబు జబ్బు పడ్డట్టే కదా! అంటున్నారు అమరావతి వాసులు.
"బతకడానికి తింటా కానీ! తింటానికి బతకను"