ప్రకృతి అందాలను తన ఒడిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, విదేశీ పర్యాటకులకు ప్రకృతి అందాలతో ఆకర్షిస్తున్న సముద్ర తీర ప్రాంతాలు  కాకినాడ, భీమవరం, పాలకొల్లు. ఇక్క ప్రజలు దాదాపుగా పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ప్రకృతిని నిలయంగా మారిన అలాంటి ప్రదేశాలు మరో పదేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు. దీనికి కారణం ఏ గ్లోబల్ వార్మింగో లేక సముద్ర నీటి మట్టం పెరగడమో అని అనుకుంటే పొరపాటే.


Image result for kaakinaada, paalakollu, bheemavaram

కాకినాడ తీరంలో పాగావేసిన చమురు వెలికితీసే సంస్థల అడ్డగోలు తవ్వకాలే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. అడ్డగోలుగా సహజవాయు నిక్షేపాలు తవ్వుకుని తీసుకుపోతుండడంతో దాని ప్రభావం తమపై పడుతోందని, తమ జీవనాధారం, కొంప, గోడు, గొడ్డు, గోద మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చమురు నిక్షేపాలు అధికంగా ఉండడంతో, చమురు నిక్షేపాల అవసరం కూడా ప్రజలకు అత్యవసరంగా మారడం తో తప్పనిసరి పరిస్థితుల్లోనైనా తవ్వకాలు జరపక తప్పడం లేదు. 


Image result for kaakinaada, paalakollu, bheemavaram

విశాఖపట్టణంలో ఏడాదికి 0.65 సెంటీ మీటర్ల సముద్ర మట్టం పెరుగుతుండగా, గత నాలుగైదేళ్లలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం ఐదు అడుగుల లోతుకు భూమిలోకి దిగబడిపోయాయని వారు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి పరిరక్షణ సమితి ఈ విషయం పై  తీవ్ర ఆందోళన ను వ్యక్తం చేస్తుంది.  రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడి ప్రజల మనుగడ ఉంటుందని, లేని పక్షంలో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవడమే అవుతుందని వారు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: