తలాక్, తలాక్, తలాక్ - అంటే ట్రిపుల్ తలాక్ పై దేశమంతా నరెంద్ర మోదీ చేసిన విప్లవాత్మక నిర్ణయం పై ముమ్మరంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఓ ముస్లిం మహిళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ ఆచారం వలన బాధితులవుతున్నవారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె ప్రశం సించారు.
ఉత్తరాఖండ్ లోని "కిచ్చా" ప్రాంతములో నివసించే ఒక ముస్లిం మహిళ ట్రిపుల్ తలాక్ విధానంపై అత్యంత అంతులేని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతం లోకి మారితే, పురుషులు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వలేరని అన్నారు. తన స్వంత సోదరి ట్రిపుల్ తలాక్ బాధితురాలని ఆవేదనతో చెప్పారు. కేవలం మూడు అంటే మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ చెప్పి, జీవితంలో ఎప్పుడైనా భార్యను వదిలేయడానికి అవకాశం ఉన్నపుడు, ఆ వ్యక్తితో మొత్తం జీవితాన్ని గడపడం వల్ల మహిళలకు లభించే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
ప్రస్తుతం తాను యుక్తవయసు లో ఉన్నానని, ట్రిపుల్ తలాక్ గురించి భయపడుతూ మొత్తం జీవితాన్ని ఎందుకు గడపాలని ఆమె సూటిగా ప్రశ్నించారు. హిందూ మతం లోకి మారి, ఓ హిందువును పెళ్ళి చేసుకుంటే, కనీసం మూడు మాటలు మాత్రం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటాడన్న భరోసా ఉంటుందన్నారు. ఎందుకంటే హిందూ మతములో అంత సునాయాసంగా మహిళలను వదిలించుకునే అవకాశం ఉండదు.
ప్రధాని నరెంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఆయన దేశం కోసం చేస్తున్నది మంచి పనేనని అన్నారు. మహిళల కోసం, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం ఆయన చేస్తు న్నది చాలా గొప్ప గానూ చాలా బాగుందన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా ఆమె ప్రశంసించారు.