వైసీపీ ఎమ్మెల్యే రోజా తన టార్గెట్ ను బాబుతో బాటే లోకేష్ పై కూడా మళ్లించినట్టు తెలుస్తుంది. ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ మంత్ర్రి వర్గంలోకి అడుగు పెట్టిన లోకేష్ పై వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. ముఖ్యంగా రోజా మాత్రం తండ్రి కొడుకులపై రోజుకో అంశం తో విరుచుకుపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా లో లోకేష్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పొలిటికర్ పంచ్ పేరిట ఫేస్ బుక్ లో అకౌంట్ ను నడిపిస్తున్న రవి కిరణ్ వైసీపీ శ్రేణుల కు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన్ని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అంశాన్ని పక్కన బెడితే..మంత్రిగా 20 రోజుల్లో లోకేశ్ చేసిన కామెడీ చూసి అలసిపోయామని చురకలంటించారు. గూగుల్లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు లోకేశ్ ఫొటో కూడా వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్ర మంత్రికి జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. మరోవైపు చంద్రబాబు తమకు 16 శాతం ఆదరణ పెరిగిందని అంటున్నారని, కానీ, ఏ విధంగా పెరిగిందంటే అది చెప్పడం లేదని ఆమె విమర్శించారు.
అసెంబ్లీలో జగన్ మైకు ముందు నిలబడితే సర్కారుకి దడ పుడుతోందని రోజా అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లున్నాయో కూడా తెలియకుండా 200 సీట్లలో గెలుస్తామన్నారు. ఇంత దద్దమ్మ మంత్రిని మన నెత్తిన పెట్టిన చంద్రబాబుకు కూడా బుద్ధి చెప్పాలి. నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మంత్రి అయి కూర్చున్నారు. ఇదే చంద్రబాబు సొంత జిల్లాలో పట్టభద్రులు.. అంటే మేధావులు, యువత, మహిళలు వేసిన ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ మద్దతిచ్చిన యండవిల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారన్నారు.