కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేన్సరా..? అంటే నిజమనే అంటున్నారు వైద్యులు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రచారం చేస్తున్న సోనియా ఒక్కసారి అనారోగ్యం పాలవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు జరిపితే సోనియాకు గర్భాశయ ముఖద్వారా కేన్సర్ వ్యాధి సోకినట్లు తేలింది. దీని కారణంగానే ఆమె ఇటీవల అమెరికాల వైద్యం చేయించుకొని మరీ వచ్చారు. కానీ ఆమెలో అప్పుడున్న స్పీడ్ ఇప్పుడు తగ్గింది. అనారోగ్యమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పక తప్పదు.
గత ఏడాది ఇంటి పక్కన భవనంలో కీలకమైన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంటేనే వెళ్లలేకపోయారంటే ఆమె పూర్తి విశ్రాంతి తీసుకునే దశకు చేరుకున్నారని అర్థమవుతోంది. ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశం లేదని మీడియా పండితులు చెబుతున్నారు. అంతా భుజాన వేసుకొని పనిచేయడం మానేయాలని వైద్యులు సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ కి త్వరలో పట్టం కట్టాలని ఆలోచిస్తున్నా పరిస్థితులు అందుకు సహకరించకపోవడం ఆమెలో మరింత ఆవేదన కలిగిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ వారసత్వ పార్టీ. ఇందులో ప్రజా నాయకుడి కంటే కుటుంబ నాయకుడికే విలువెక్కువ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు కూడా రాహుల్ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. సోనియా అనారోగ్యం ఒక ఆవేదన అయితే రాహుల్ పట్టాభిషేకం ఎప్పుడు చెయాల అంది మరో ఆవేదనగా ఆమెకు మిగిలింది. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో రాహుల్ కి పట్టాభిషేకం చేస్తే.. సొంత కుంపటిలోఅగ్గి రాజేసినట్లే అని సోనియా అభిప్రాయ పడుతునట్లు సమాచారం.