క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇప్పుడు మునుపటి కట్టు లేనట్టు కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆ పార్టీ ఇమేజ్ ను క్రమంగా దెబ్బ తీస్తున్నాయి. నేరుగా టీడీపీ నేతలే కొన్ని చోట్ల.. మరికొన్ని చోట్ల వారి పేరు చెప్పుకుని కుటుంబ సభ్యులు బంధుగణం చేస్తున్న అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి. తాజాగా ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు టోల్ గేట్ పై దాడి చేయడం మరింతగా పరువు తీసింది. 


ఈ పరిణామాలన్నీ చూసి చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారట. ఈ ఘటనలకు తోడు ఇటీవల పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనూ చాలా మంది నేతలు చురుగ్గా పాల్గొనలేదట. ఆ రొటీన్ ఎన్నికలేగా అని లైట్ గా తీసుకున్నారట. ఆ విషయం తెలిసి అసలే కోపంతో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలపై రంకెలేశారట. పార్టీ సంస్ధాగత ఎన్నికలకు పరిశీలకులుగా నియమించినా గైర్హాజరవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారట. 

సంబంధిత చిత్రం

ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ సంస్థాగత ఎన్నికల తీరుపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు హాజరుకాని పరిశీలకుల నుంచి సంజాయిషీలు తీసుకోవాలసిందిగా రాష్ర్ట కార్యాలయాన్ని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల ఘర్షణలు జరిగాయి. కృష్ణా జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే గాయాలైన పరిస్థితి నెలకొంది. నేతల అరాచకాలు.. నిర్లక్ష్యం చూసి రగిలిపోతున్న చంద్రబాబు త్వరలో కొంతమందిపై చర్య తీసుకుంటారట. 

సంబంధిత చిత్రం

ఎవరో ఒకరిపై చర్య తీసుకోకపోతే పార్టీకి మరింత చెడ్డపేరు రావడం ఖాయం అని నిర్థారణకు వచ్చిన ఆయన కనీసం ఇద్దరిపై చర్య తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఎంత సేపూ.. ఎవరినీ క్షమించను.. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదు.. అంటూ ప్రకటనలు ఇవ్వడమే కాకుండా చర్య తీసుకుని చూపించాలని పట్టుదలగా ఉన్నారట. మరి చంద్రబాబు కోపాని గురయ్యే వారి వరుసలో బోండా ఉమ, కేశినేని నాని, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప.. వీరిలో ఎవరు ఉంటారో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: