Basti: UP cabinet minister Swami Prasad Maurya has alleged that Muslims use triple talaq to change wives and satisfy their “lust”, remarks that are likely ...
ట్రిపుల్ తలాఖ్ అంతిమ లక్ష్యం భార్యలను మారుస్తూ తమ ‘కామాన్ని’ సంతృప్తి పరచుకోవటమేనని ట్రిపుల్ తలాఖ్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం పురుషులు ట్రిపుల్ తలాఖ్ ను ఉపయోగించుకొని, తరచూ భార్యలను మార్చుకుంటూ తమ ‘కామాన్ని’ సంతృప్తి పరుచుకుంటున్నారని, కామదాహాన్ని తీర్చు కుంటున్నారని అన్నారు. ట్రిపుల్ తలాఖ్కు ఎలాంటి మత ప్రాతిపదిక, కాని మత గ్రంధాలలోగాని వ్యాఖ్యలు గాని లేదని ఆయన కొట్టిపారేశారు.
"ముస్లిం మహిళలకు బాజపా అండగా ఉంటుంది. ట్రిపుల్ తలాఖ్ అనేది అహేతుకమైనదే కాదు సాజములో ఒక వర్గం పై నిరంకుశమైన పెత్తనం పురుషాధిక్యత ప్రదర్శిం చటమేనని అన్నారు. ఒక వ్యక్తి తన కోరికను సంతృప్తి కోవడానికి తరచూ భార్యలను మార్చి, తరవాత సొంత భార్యాపిల్లలను వీధుల పాలు చేసి అడ్డుక్కు తినమనడం సరై నది కాదు. దీనిని ఎవరూ ఒప్పుకోరు" అని బస్తీలో శుక్రవారం ఆయన విలేకరులతో పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ బాధితులకు బాజపా అండగా ఉంటుం దని చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ పై ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, దీనిపై పరిష్కారానికి ముస్లిం సామాజికవర్గం ముందుకురావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.