తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల రాజకీయాల్లో మరింతగా జోరు పెంచేశారు. మొన్నటికి మొన్న వికారాబాద్ సభలో టీడీపీ పై రెచ్చిపోయారు. ఆ తర్వాత అనుకోకుండా ఖమ్మం మార్కెట్ యార్డు అంశం ఆయుధంగా కలిసొచ్చింది. 

దాన్ని అందిపుచ్చుకునేందుకు ఖమ్మం జిల్లాకు హుటాహుటిన పయనమయ్యారు. రైతుల ఆందోళనకు చేయి కలిపిన కొద్దిసేటికే ఆయన ఇంట్లో విషాదం వార్త ఆయన్ను కలచి వేసింది. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మరణించారని సమాచారం వచ్చింది. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 



ఆమె గచ్చిబౌలిలో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఉన్న సమయంలో ఆమె మృతి చెందిన కబురు అందింది. దాంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: