ప్రపంచం మొత్తం యుద్ద వాతావరణం అలుముకుంటుంది. ఒకపక్క ఐసిస్ ఉగ్రవాదం మరోపక్క ట్రంప్ దురాక్రమణ వాదం, ఇంకోపక్క పాకిస్థాన్ తీవ్ర ఉగ్రవాదాన్ని జన్మభూమి అయి కూర్చుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం దాని లక్షణం భారత్ పై ప్రతీ దానికి కాలుదువ్వటం వెనుక చైనా సపోర్ట్ ముఖ్య కారణం. పాక్ శత్రువు భారత్. చైనా శత్రువు భారత్. మిత్రుని శత్రువు మిత్రుడే. ఇది చాలు పాక్ చైనా మైత్రికి కారణం.
మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్తో 10 రోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం చేసేందుకు వీలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. గతవారం న్యూఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
‘ఒకవేళ పాకిస్థాన్తో పదిరోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనడానికి వీలుగా ఐఏఎఫ్ కమాండర్లు స్వరసన్నద్ధంగా ఉండాలని ఎయిర్చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆదేశించారు. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు’ అని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి.
తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలుపాలంటూ ఇప్పటికే "డైరక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్ఫెక్షన్" కు ఆదేశాలు అందాయి. ఎయిర్ఫోర్స్ సిబ్బందిని, యుద్ధ విమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్ రాడర్ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి.