తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన పొరపాట్లు నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనబడటం లేదు , అధికారం కోసం కులాల మధ్యచిచ్చు పెట్టడం, ఒకే కులానికి రెండు వర్గాలుగా చీల్చే విధానాన్ని మళ్లీ ఆ పార్టీ ప్రవేశపెడుతోంది.  గత కొద్దిరోజులుగా వరుసగా కులాలవారీగా ఎకరవు పెడుతున్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మొన్న బీసీల సమావేశం అంటూ ఒక డిక్లరేషన్ను ప్రకటించారు. తాజాగా ఎస్సీల సమావేశం పెట్టి వర్గీకరణకే మొగ్గు చూపించారు. మరి రానున్న రోజుల్లో కుల, సామాజికవర్గం ప్రాతిపాదికన మరిన్ని సమావేశాలను నిర్వహిస్తారో చూడాలి. అయేతే అన్ని కులాలు, మతాలతో నేటికి సమాజానికి సంబంధాలు లేకుండా ఎక్కడో దూరంగా నివసిస్తున్న ఉపకులాలు, జాతుల గురించి బాబుకు తెలుసా అన్నది అనుమానమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: