బాలీవుడ్ హాట్ బ్యూటీ..ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ అంటే తెలియని వారు ఉండరు.  ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో ఉండే ఈ అమ్మడు తాజాగా తన నోటికి మళ్లీ పని చెప్పింది.  సాధారణంగా ఎవరిపై పడితే వారిపై వేడివేడి కామెంట్లు చేసి వార్తల్లోకెక్కే రాఖీ ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నే టార్గెట్ చేసింది.  గత కొన్ని రోజులుగా ట్రంప్ పై రక రకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాఖీ సావంత్ తనదైన స్టైల్లో స్పందించింది.  
Image result
డొనాల్డ్ ట్రంప్ ఇస్లామోఫోబియాతో బాధ పడుతున్నారని, ఒక అధ్యక్షుడిగా అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని మంటెక్కిపోయింది. డొనాల్డ్ ట్రంప్ తనతో కలిసి కొంత కాలం ‘హాట్ యోగా’ చేయాలని అలా చేస్తే ఆయలో ఉన్న చెడు ఆలోచనలు అన్నీ సమసి పోతాయని అంటుంది.
Image result for modi
అంతే కాదు ఈ దెబ్బతో నీ ఉడుకంతా తగ్గిపోతుందంటూ ట్రంప్ మీదే సెటైరేసింది.  ఇక ఈ గొలలోకి భారత ప్రధానమంత్రి మోడిని కూడా లాగింది. అమెరికా జనులారా.. మీకు బంగారు భవిష్యత్తు కావాలంటే నరేంద్ర మోడీకి ఓటేసి ప్రెసిడెంటుగా ఎన్నుకోండి.. అంటూ పిలుపునిచ్చేసింది కూడా. మా మోదీని మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించేసుకుంది రాఖీ సావంత్. మొత్తానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: