తెలంగాణా టీడీపీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల్లో పూర్తి ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. టీడీపీ పాలన తెలంగాణా ప్రాంతం లో బోలెడు మార్పులు తీసుకువచ్చింది అనీ టీడీపీ అధికారం లోకి వచ్చిన తరవాతనే అనేక అభివృద్ధి పనులకి ఇక్కడ పునాదులు పడ్డాయి అన్నారు బాబు. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడే వరకూ పోరాటం కొనసాగించాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.


తెలంగాణ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొదమసింహాల్లా దూసుకెళ్తున్నారని బాబు ప్రశంసించారు.పోరాటాల సమయంలో కష్టం సుఖం వచ్చినప్పుడు మీతోనే ఉన్నానని చంద్రబాబు గుర్తు చేశారు. కష్టపడటం వల్లే మన పార్టీ బాగుపడుతోందని తెలిపారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది టీడీపీయేనన్నారు.


తెలుగువారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉండే పార్టీ మనదని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఎక్కడున్నా.. ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేది లేదని చెప్పారు. కేవలం 50రోజుల్లో 7.5లక్షల మంది సభ్యత్వ నమోదు చేసిన తెలంగాణ టీడీపీ నేతలు అంతా ఏకతాటిపై నడుస్తూ...నడిపిస్తూ ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: