"మంత్రి వస్తే రావాలని తెలీదా ? బలిసిందా? తంతాను జాగ్రత్త" అంటూ ఒక సీనియర్ తెలుగు దేశం పార్టీ నేత ఆంధృఅ ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్రెడ్డి నెల్లూరు నాలుగో టౌన్ సీఐ సీతా రామయ్యపై చిందులేశారు. "తానేం తప్పు చేశానని కొడతారు? ఇదేం బాగా లేదని" మంత్రిని సీఐ నిలదీశారు. ఈ వ్యవహారం పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహించడంతో ఆ సీఐని గుంటూరు ఐజీ సంజయ్ వత్తిడి వీఆర్కు (వేకెన్సి తిజర్వ్) పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది ఒక ఉదాహరణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పాలన తీరుతెన్నులకు.
అందిన సమాచారం మేరకు నెల్లూరు లోని "ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్" పూలు, పండ్ల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం కోసం ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒక కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి నెల్లూరు నాలుగో టౌన్ సీఐ సీతారామయ్య రక్షణ భాధ్యతలు తన బృందంతో పర్యవేక్షిస్తున్నారు.
అదే సమయంలో సీఐ సీతారామయ్య పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతోందని ఎస్పీ విశాల్గున్నీ కి సమాచారం అందింది. ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్ఐ లను డ్యూటీలో ఉంచి సీఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
ఈలోపు మార్కెట్కు వచ్చిన మంత్రి సోమిరెడ్డి ఎస్ఐ లను చూసి "మంత్రి వస్తే సీఐ రావాలని తెలీదా? మీకేం బలిసిందా?" అంటూ అమర్యాదగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రి ఆగ్రహించిన విషయాన్ని ఎస్ఐలు సీఐకి చేరవేశారు. సీఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి కార్యక్రమం ముగిశాక మంత్రికి కనిపించారు. సీఐని చూడటంతోనే సోమిరెడ్డి ఆయన మీద మండి పడుతూ అగిమీద గుగ్గిలమే ఐపోయారు.
"మంత్రి వస్తే రావాలని తెలీదా? బలిసిందా? నిన్ను తంతాను" అని అమాత్యవర్యులు అసహ్యన్ కలిగించేలా దుర్భాషలాడా రని సమాచారం. ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందిన సీఐ సీతారామయ్య "తానేం తప్పు చేశానని తంతారు" అని, సి ఐ మర్యాదగా మంత్రిని ప్రశ్నించారట. మంత్రి తనను దూషించారని సీఐ అదే రోజు జిల్లా ఎస్పీకి, ఐజీకి ఫిర్యాదు చేశారు.
ప్రజలముందు సీఐ తనకు ఎదురు తిరిగారని, అతడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గుంటూరు ఐజీ సంజయ్ మీద ఒత్తిడి తెచ్చారని తెలిసింది. మంత్రి ఒత్తిడి మేరకు సీతారామయ్యను వీఆర్కు పంపుతూ బుధవారం రాత్రి ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో సీసీఎస్-సీఐ సుధాకర్రెడ్డిని నియమించారు. ఈ వ్యవహారం పైపోలీసు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని మంత్రి దూషిస్తే, తిరిగి ఆయన్ను వీఆర్కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు.
ఒక పోలీస్ అధికారితో ఎలా ప్రవర్తించి పనిచేయించుకోవాలో తెలియని సీనియర్ మత్రి ఎలా ప్రజా పాలన చ్క్రస్తారని, మంత్రి సి.ఐ ని వీఅర్ కు పంపటం లో ఔచిత్యమేమిటని ప్రజలు సోమిరెడ్డి పై చిందులేస్తున్నారు.
అయినా ఆంధ్రప్రదేశ్ లో ఐపిఎస్ ఐయేఎస్ అధికార్ల బ్రతుకులే బండలైన సమయంలో ఆఫ్ట్రాల్ సి.ఐ సీతారామయ్య, రెవెన్యూ అధికారిణి వనజాక్షి ఎంత? అధికారులంతా "అక్కడ నీ కాల్మొక్కుత బాంచన్ దొరా అనాల్సిందే" అంటున్నారు రోజూ సోమిరెడ్డి చెప్పే నీతుల్ని రోజూ టివి లో వీక్షించే తెలంగాణా వాసులు ఇక ఆయన ముఖం టివిల్లో చూడలేం అంటున్నారు.