భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై, యువతులపై లైంగిక వేదింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా..మహిళల కోసం ప్రత్యేక రక్షణ బృందాలు ఏర్పాటు చేసినా కామాంధుల అరాచకాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కొంత మంది పోకిరిగాళ్లు తల్లీ కూతుళ్లపై జరిపిన లైంగిక దాడి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఆ పోకిరిగాళ్లు లైంగిక దాడి చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే స్థాయికి ఎదిగారు.  

దారెంట వెళ్తున్న ఇద్దరు మహిళలను వెంబడించి వికృత చేష్టలకు దిగారు ఈ పోకిరీ గ్యాంగ్. ఇద్దరు మహిళలూ వారిస్తున్నా, వేడుకుంటున్నా.. వారిని లాగడం.. తాకరాని చోట తాకడం.. ఎత్తుకెళ్లడం వంటి పనులు చేశారు.ఇలాంటి విపరీత చేష్టలకు దిగుతూనే మరోవైపు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇదిలాఉండగా, ఈ వీడియోపై పోలీసులు రంగంలోకి దిగి.. ఇద్దరిని అరెస్టు చేశారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయ్యాక ఆడాళ్లపై వేదింపుల నివారణకు యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయక అల్లరి మూకలు ఈ వీడియోలో ఎలా రెచ్చిపోయారో కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: