ఈ మద్య కొంత మంది ఉన్మాదులు చిన్న విషయానికి ప్రాణాలు తీసేంతగా రెచ్చిపోతున్నారు.  కొంత మంది క్రేజ్ కోసం అయితే..మరికొంత మంది ఆవేశం తట్టుకోలేక చేస్తున్న పనుల వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి.  తాజాగా ఢిల్లీలో ఓ రౌడీ ముక చేసిన ఘారానికి ఓ అమాయకుడు తన ప్రాణాలు కోల్పోయాడు..మరి ఇంతకీ ఆ వ్యక్తి చేసిన తప్పేంటో తెలుసా..? పబ్లిక్ ప్లేసెస్ లో మల మూత్ర విసర్జన సరికాదు అనడమే.

 భారత దేశంలో ఓ వైపు స్వచ్చ్ భారత్ అంటూ పెద్దలు ఊదరగొడుతున్నారు.  దీనికోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.  తాజాగా వాయువ్య ఢిల్లీలో రవీందర్ కుమార్ అనే పార్కింగ్ అటెండెంట్ తన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆకతాయిలు అక్కడకు వచ్చి పబ్లిక్ ప్లేసెస్ లో మల మూత్ర విసర్జన చేస్తున్నారు.

 వెంటనే రవిందర్ అక్కడకు వెళ్లి ఇది పబ్లిక్ ప్లేస్ మూత్ర విసర్జన సరికాదంటూ అనడంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ ఇద్దరు యువకులు అక్కడ నుంచి వెళ్లి మరి కొంత మంది గ్రూప్ తో వచ్చి రవిందర్ పై విచక్షణారహింతంగా దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు.   ఇలాంటి దారుణాలు దేశ రాజధానిలో ఎన్నో జరుగుతున్నా రక్షణ కరువైందని స్థానికులు వాపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: