ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ మరో యువకుడిని బలితీసుకుంది. ప్రేమికురాలు తనను కాదందన్న ఆక్రోశం ఓ యువకుడి బలవన్మరణానికి కారణమైంది. క్షణికావేశం అతనిలో విచక్షణను చంపేసింది. ప్రియురాలి కళ్ల ముందే.. అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని ఏ మాత్రం ఆలోచించకుండా ఐదు అంతస్తుల నుంచి దూకేశాడు. ప్రాణాలు పొగొట్టుకున్నాడు. 

సంబంధిత చిత్రం

ఈ సంచలన ఘటన హైదరాబాద్‌ నగర శివారు మియాపూర్‌లో జరిగింది.  హైటెక్‌ సిటీలో ఎలక్ట్రిషియన్‌ గా  పనిచేసే 26 ఏళ్ల జగదీశ్‌ అనే యువకుడు మియాపూర్ జనప్రియ ఫోర్త్‌‌ ఫేస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తన ప్రియురాలి వద్దకు వచ్చాడు. ఆమెతో కలసి అపార్ట్ మెంట్ పైకెళ్లి మాట్లాడుతున్నాడు. ప్రియురాలు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని తెలుస్తోంది.

love failure suicidal కోసం చిత్ర ఫలితం

కొంతకాలంగా వీరిద్దరు తరుచు కలుస్తుండే వారని తెలిసింది. ప్రియుడు మహబూబాబాద్‌ జిల్లా డొర్నకల్‌ మండలం గొల్లచెర్ల గ్రామానికి చెందిన అంజయ్య కుమారుడు జగదీశ్. 
మరి ఐదంతస్తుల భవనంపై ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. అకస్మాత్తుగా జగదీశ్ 5 అంతస్తుల భవనంపై నుంచి దూకేశాడని అక్కడి వాచ్ మెన్ చెబుతున్నారు. ప్రేమ విఫలమే కారణమని స్థానికులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: